ప్రబోధిని ఏకాదశి, ఉత్తాన్న ఏకాదశి
- శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉంటాడు.
- ఆషాడ శుక్ల ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమిస్తాడు, కనుక ఆ రోజు తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని అంటారు.
- తిరిగి ఉత్థాన ఏకాదశి అని పిలిచే కార్తీక మాస శుక్ల ఏకాదశి నాడు నాలుగునెలల యోగనిద్ర చాలించుకుంటాడు.
- ఏకాదశి ప్రాముఖ్యాన్ని గురించి స్కాంద పురాణంలో నారదుడికి బ్రహ్మ వివరించాడు.
- ఈ ఏకాదశికి విశేష మహిమ ఉంది. దీనిని ఆచరించిన వారికీ పవిత్ర నదులు, సముద్ర స్నానం ద్వారా లభించే పవిత్రత కన్నా అధికంగా లభిస్తుంది.
- ఈ రోజు ఏకభుక్తం చేసిన వారికీ గతజన్మ పాపాలు నశిస్తాయి. కేవలం రాత్రి వేళా తింటే గత రెండు జన్మల పాపాలు నశిస్తాయి.
- కటిక ఉపవాసంతో పాటు, పూర్తీ రాత్రి జాగరణ ఉంటే గత వెయ్య జన్మల పాపాలు నశిస్తాయి.
- రాత్రి విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు పురాణ కథలు చదువుతూ జాగరణ చేయాలి.
- రోజు అంత ఉపవాస దీక్షలో వున్నా వారు మరునాడు, అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుపూజ చేసి దీక్ష విరమిస్తారు.
- ఈ వ్రతం చేసిన వారి ఇంటిలో సర్వ పుణ్యక్షేత్రాల దివ్యత్వం ఉంటుంది.
ఈ రోజుతో చాతుర్మాస దీక్ష ముగుస్తుంది.
ఈ రోజు పండరి యాత్ర ముగుస్తుంది.
ఈ రోజు భీష్మ పంచక వ్రతం కూడా ఆచరిస్తారు.
2022 : నవంబర్ 04.
Post a Comment